సాక్షి, అమరావతి : దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని సీఎం జగన్ అభిలషించారు.
చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక. సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలతో తెలుగునేల ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలని ఆకాంక్షిస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.#HappyDiwali
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 27, 2019