హైదరాబాద్‌ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

12 Jan, 2020 04:18 IST|Sakshi

13న కేసీఆర్‌తో భేటీ అనంతరం తాడేపల్లికి రాక

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాద్‌ వెళ్లారు. ఆయన ఈ నెల 12, 13 తేదీల్లో అక్కడే ఉంటారు. 13వ తేదీ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమై ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. భేటీ అనంతరం 13వ తేదీ రాత్రికి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. 
 

మరిన్ని వార్తలు