విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట రైల్వే స్టేషన్లో బొగ్గు కుంభకోణం చోటు చేసుకుంది. ఇక్కడ నిల్వ ఉన్న బొగ్గును పరిశ్రమలకు అక్రమంగా తరలించారు. రైల్వే అధికారులే ఈ అక్రమాలకు పాల్పడ్డారు. అందిన సమాచారం ప్రకారం ఇక్కడ భారీగా బొగ్గు నిల్వ ఉంది. ఈ బొగ్గును ఏడు లారీలో ఎక్కించి రైల్వే అధికారులు అక్రమంగా తరలించారు.
ఈ బొగ్గు విలువ ఆరు లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ పరిశ్రమలకు ఈ బొగ్గును తరలించినట్లు లారీ అసోషియేషన్ వారు ఆరోపిస్తున్నారు.