జగ్గయ్యపేటలో బొగ్గు కుంభకోణం

14 Dec, 2013 16:54 IST|Sakshi
జగ్గయ్యపేటలో బొగ్గు కుంభకోణం

విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట రైల్వే స్టేషన్‌లో బొగ్గు కుంభకోణం చోటు చేసుకుంది. ఇక్కడ నిల్వ ఉన్న బొగ్గును పరిశ్రమలకు అక్రమంగా తరలించారు. రైల్వే అధికారులే ఈ అక్రమాలకు పాల్పడ్డారు.  అందిన సమాచారం ప్రకారం ఇక్కడ భారీగా బొగ్గు నిల్వ ఉంది. ఈ బొగ్గును  ఏడు లారీలో ఎక్కించి  రైల్వే అధికారులు  అక్రమంగా తరలించారు.

ఈ బొగ్గు విలువ ఆరు లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌ పరిశ్రమలకు ఈ బొగ్గును తరలించినట్లు  లారీ అసోషియేషన్‌ వారు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు