కోడిపందాలు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్

17 May, 2015 12:34 IST|Sakshi

మంత్రాలయం (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా మంత్రాలయం డివిజన్‌లోని తారాపురం గ్రామంలో ఆదివారం కోడిపందెం శిబిరంపై దాడి చేశారు. ముందస్తు సమాచారంతో దాడిచేసిన మంత్రాలయం పోలీసులు.. ఈ దాడిలో ఏడుగురిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.7,900లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక కారు, 30 స్కూటర్లు, మూడు కోడిపుంజులు కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు