సాక్షి, అనంతపురం : భూ అక్రమాలపై కలెక్టర్ వీరపాండ్యన్ సీరియస్ అయ్యారు. కూడేరు తహశీల్దార్ వసంత లతతో సహా ఏడుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. డబ్బు తీసుకొని ప్రభుత్వ భూములకు ఇష్టారాజ్యంగా కూడేరు రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేశారు. విచారణలో నిజాలు నిగ్గు తేలటంతో అక్రమార్కులపై కలెక్టర్ వేటు వేశారు.