శేషాచలం అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్!

29 May, 2014 14:33 IST|Sakshi
శేషాచలం అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్!
తిరుమల: ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునేందుకు శేషాచల అడవుల్లో పోలీసులు కూంబింగ్‌  కొనసాగిస్తున్నారు. పోలీసులపై గొడ్డళ్లతో ఎర్రచందనం స్మగ్లర్లు దాడికి పాల్పడటంతో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్టు ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు. 
 
స్మగ్లర్లు పోలీసులపై గొడ్డళ్లతో దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం జరిపిన పోలీసుల కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు.  ఇంకా 100మంది స్మగ్లర్లు ఉన్నట్లు అనుమానంగా ఉంది. శేషాచలం అడవులను స్మగ్లర్ల ఫ్రీజోన్‌గా మారుస్తాం అని ఎస్పీ రాజశేఖరబాబు అన్నారు. 
మరిన్ని వార్తలు