నంది అవార్డుల ఎంపికకు కమిటీలు

22 Dec, 2016 02:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: చలనచిత్ర రంగంలో విశేష ప్రతిభ చూపిన కళాకారులను అవార్డులకు ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. 2012, 2013 సంవత్సరాలకు సంబంధించి ఎన్టీఆర్‌ స్మారక జాతీయ చలనచిత్ర అవార్డు, పలువురు ప్రముఖుల స్మారక రాష్ట్రస్థాయి అవార్డులు, ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర,, టీవీ నంది అవార్డులకు ప్రతిభావంతులను ఎంపిక చేయడం కోసం వేర్వేరు కమిటీలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు