జనసేన నేతపై ఫిర్యాదు

25 Nov, 2018 09:08 IST|Sakshi

ఏలూరు టౌన్‌ : జనసేన పార్టీ నేతపై ఆ పార్టీ కార్యకర్తే తనను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నా యి.. పెదవేగి మండలం కవ్వగుంటకి చెం దిన పసుపులేటి శ్రీరామభార్గవ్‌ కృష్ణ జనసేన కార్యకర్త. ఏడాదిన్నర క్రితం నారా శేషు జనసేనలోకి వచ్చి నాయకుడిగా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో ఫ్లెక్సీలు వేసి తనను ప్రమోట్‌ చేసేందుకు రూ.20 వేలు ఖ ర్చులుగా భార్గవ్‌ కృష్ణకు ఇచ్చారు. కొంతకాలం తర్వాత నారా శేషు వ్యవహార శైలి నచ్చకపోవడంతో కృష్ణ తదితరులు అతడికి దూరంగా ఉంటున్నారు. దీంతో కోపం పెం చుకున్న నారా శేషు గతంలో ఖర్చుల కోసం ఇచ్చిన సొమ్ములు తిరిగి ఇచ్చేయాలంటూ కృ ష్ణను వేధిస్తున్నాడు. రౌడీలను ఇంటికి పంపి బెదిరించాడు.

ఈనేపథ్యంలో ఈనెల 15న కృష్ణ తన హూండా డియో స్కూటర్‌ ఏలూరు అంబికా థియేటర్‌ సమీపంలో పార్కింగ్‌ చే యగా కనిపించలేదు.  వంగాయగూడెంకు చెందిన వరం, బొత్స మధు అనే వ్యక్తులు తీసుకువెళ్లినట్టు తెలిసింది. ఇదే సమయంలో వరం కృష్ణకు ఫోన్‌ చేసి స్కూటర్‌ను నారా శేషు తీసుకురమ్మని చెప్పారని, సొమ్ములు చె ల్లించి తీసుకువెళ్లాలని అనడంతో కృష్ణ పో లీసులను ఆశ్రయించాడు. జనసేన నేత శేషు, వరం, మధుపై ఫిర్యాదు చేశారు. టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు