దళితులపై వేటకొడవళ్లతో దాడి

2 Jan, 2014 20:57 IST|Sakshi

చిత్తూరు: పీలేరు కాంగ్రెస్‌ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. సర్పంచ్‌ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి  మద్దతుదారిడికి ఓట్లేసినందుకు దళితులపై వేటకొడవళ్లతో దాడి చేశారు. మొరంరెడ్డిగారిపల్లె దళితవాడలో ఈ ఘటన జరిగింది.  కాంగ్రెస్‌ నేత బాలం నరేంద్ర రెడ్డి నేతృత్వంలో దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

ఈ దాడిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని రుయా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు