బాబు భూ బకాసురుడయ్యాడు : శైలజానాథ్‌

22 Jul, 2016 16:12 IST|Sakshi
బాబు భూ బకాసురుడయ్యాడు : శైలజానాథ్‌
హైదరాబాద్‌: ప్రతిపక్షాలు అన్నీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేయాలని పార్లమెంట్‌లో పోరాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ బకాసురుడిగా వ్యవహరిస్తున్నాడని ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శైలజానాథ్ ఆరోపించారు. రాజకీయ పార్టీలకు రాజధానిలోను , జిల్లా కేంద్రాల్లోనూ భూములను కేటాయించే చట్టానికి బాబు ఇష్టానుసారంగా సవరించడం సరికాదన్నారు. శ్రీకాకుళం, కడప, కాకినాడలో ఇప్పటికే కోట్ల విలువైన భూముల్ని టీడీపీ చేజిక్కించుకోవడం అన్యాయమన్నారు. పార్టీలకు భూములిచ్చే అంశంలో 1987 లోఎన్టీఆర్ తెచ్చిన చట్టాన్నే యధావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
మరిన్ని వార్తలు