తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు ఇప్పటికైన బుద్ధి తెచ్చుకోవాలని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి అన్నారు. గతేడాది ఇదే రోజున గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిన పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. వారి ఆత్మకు శాంతి చేకూరాలని గురువారం తిరుపతిలో మున్సిపల్ కార్యాలయం ఎదుట శ్రీదేవి నేతృత్వంలో కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ... వచ్చే నెలలో జరగనున్న కృష్ణా పుష్కరాల్లో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా జగ్రత్తలు తీసుకోవాలన్నారు. గోదావరి మృతుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగంతోపాటు ఆర్థిక సాయం అందించాలని టీడీపీ ప్రభుత్వాన్ని శ్రీదేవి డిమాండ్ చేశారు.