హస్తిన బాట పడుతున్న కాంగ్రెస్ నేతలు

11 Jul, 2013 15:45 IST|Sakshi

హైదరాబాద్ : తెలంగాణ అంశంపై కాంగ్రెస్ కోర్‌కమిటీ కీలక భేటీకి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో  
మంతనాలు జోరందుకున్నాయి.  కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరే  ఢిల్లీ బాట పడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు హస్తినలో మకాం వేసి అధిష్ఠానం పెద్దలను కలుస్తుండగా తాజాగా పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు గీతారెడ్డి, డీకే అరుణలు కూడా ఢిల్లీ బయలుదేరారు.

ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను హైకమాండ్‌కు వివరిస్తానని తెలిపారు. కీలక నిర్ణయం రాబోతున్న తరుణంలో పెద్దలకు అందుబాటులో ఉండడానికి తానూ, కొంతమంది మంత్రులు ఢిల్లీ వెళ్తున్నామని గీతారెడ్డి చెప్పారు.  తెలంగాణకు వ్యతిరేకంగా ఎట్టిపరిస్థితుల్లో నిర్ణయం రాదని డీకే అరుణ ధీమాగా చెప్పారు. ఇంకాసేపట్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు.

మరిన్ని వార్తలు