పీసీసీ చీఫ్‌ పదవి ఇవ్వండి: దిగ్విజయ్‌ను కోరిన దానం

3 Mar, 2014 16:10 IST|Sakshi
పీసీసీ చీఫ్‌ పదవి ఇవ్వండి: దిగ్విజయ్‌ను కోరిన దానం
రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ తో మాజీ మంత్రి దానం నాగేందర్ భేటి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న పరిస్థితులను దిగ్విజయ్ కు దానం వివరించినట్టు తెలుస్తోంది. రాష్టంలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో జంట నగరాల్లో పార్టీ విజయానికి తోడ్పాటునందించే అంశాలను దిగ్విజయ్ దృష్టికి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. 
 
రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రతికూల పవనాలు వీస్తున్నాయని.. తనకు పార్టీ పగ్గాలు అప్పగించితే తాను విజయానికి కృష్టి చేస్తానని దిగ్విజయ్ తో అన్నట్టు సమాచారం. ఎన్నికల ముందే పీసీసీ చీఫ్‌ పదవి ఇవ్వాలని దిగ్విజయ్‌ను దానం కోరినట్టు తెలుస్తోంది. అయితే దానం విజ్ఞప్తికి దిగ్విజయ్ ఎలాంటి హామీ ఇవ్వలేదని విశ్వసనీయ సమాచారం. 
 
>
మరిన్ని వార్తలు