అనంతపురం: అనంతపురం జిల్లాలో అధికార టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ముద్దిగుబ్బ మండలం రాళ్ల అనంతపురంలో కానిస్టేబుల్ హరినాయక్పై దాడికి పాల్పడ్డారు.
టీడీపీ కార్యకర్తలు కేశవ్, ప్రభాకర్లు తనపై దాడి చేశారని కానిస్టేబుల్ హరినాయక్ ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా కేసు నమోదు చేసేందుకు ఎస్ఐ నిరాకరించారు. అంతేగాక టీడీపీ కార్యకర్తలతో రాజీ కావాలంటూ కానిస్టేబుల్పై ఎస్ఐ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.