ఆత్మహత్యాయత్నం చేసిన కానిస్టేబుల్‌

1 Nov, 2019 14:05 IST|Sakshi

సాక్షి, అనంతపురం : పై అధికారులు వేధిస్తున్నారనే మనస్థాపంతో ప్రకాష్‌ అనే కానిస్టేబుల్‌ శుక్రవారం అంబేద్కర్‌ సెంటర్ వద్ద కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు విచారించగా, రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్‌​ వెంకటరమణ వేధిస్తున్నారనీ, ప్రమోషన్‌, ఇంక్రిమెంట్లలో తనకు అన్యాయం జరిగిందని ప్రకాష్‌ ఆరోపించారు. ఈ ఘటనపై సమాచారమందుకున్న కలెక్టర్‌ సత్యనారాయణ ఎస్పీతో మాట్లాడి న్యాయం చేస్తానని బాధితుడికి హామీ ఇచ్చారు. 

>
మరిన్ని వార్తలు