విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కానిస్టేబుల్ మృతి

29 Jul, 2015 12:22 IST|Sakshi

కడప: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరంలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ మృతిచెందాడు. షరీఫ్(26) అనే కానిస్టేబుల్ ఉదయం బైక్‌పై విధులకు వెళ్తుండగా అల్మాస్‌పేట సమీపంలో అదుపు తప్పి విద్యుత్‌స్తంభాన్ని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు రిమ్స్‌కు తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు.

మరిన్ని వార్తలు