బంద్‌తో ప్రభుత్వ ఆదాయానికి గండి

30 Mar, 2018 12:28 IST|Sakshi

సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారుల బంద్‌ కొనసాగుతోంది. మద్యం వ్యాపారులు చేస్తున్న సమ్మెతో రెండు కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పండింది. ఈ నిరవధిక సమ్మెతో జిల్లా వ్యాప్తంగా 241 మద్యం దుకాణాలు, 34 బార్లు మూత పడ్డాయి.

ట్రేడ్‌ మార్జిన్‌ను పెంచాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్‌కు రాష్ట్ర అసోసియేషన్‌ ప్రతినిధులు విజ్ఞప్తి చేసినప్పటికి ప్రభుత్వం స్పందించకపోవడంతో మద్యం వ్యాపారులు బంద్‌ వైపే మొగ్గు చూపారు. ఈనెల 27 నుంచి మార్జిన్‌ మనీ 7 నుంచి 24 శాతానికి పెంచాలని బంద్‌ పాటిస్తున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు