'మత మార్పిడులను ఆపాల్సిందే'

18 Dec, 2014 11:16 IST|Sakshi

హైదరాబాద్:దేశంలో జరుగుతున్న మత మార్పిడులను ఆపాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గతంలో కోట్ల మందిని మత మార్పిడి చేసిన అంశాన్ని ఆయన శాసనసభలో ప్రస్తావించారు. వెంకటేశ్వరస్వామి సన్నిధి తిరుపతిలో కూడా మత మార్పిడులు జరుగుతున్నాయని కామినేని అన్నారు.

 

ఈ మత మార్పిడులను ఆపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో జరిగిన మత మార్పిడులను సమర్ధించిన వారు.. ఇప్పుడు రివర్స్ కన్వర్షన్ లు జరిగితే తప్పుబడుతున్నారని కామినేని తెలిపారు.

 

మరిన్ని వార్తలు