కుక్కర్ పేలి నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు

2 Mar, 2016 15:13 IST|Sakshi

అంగన్‌వాడి కేంద్రంలో కుక్కర్ పేలి నలుగురు విద్యార్థులు గాయపడిన ఘటన బుధవారం డాబాగార్డెన్స్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. నగరంలోని 21వ వార్డులో ఉన్న అంగన్‌వాడి కేంద్రంలో అన్నం వండుతుండగా ప్రమాదవశాత్తు కుక్కర్‌పేలి మురళీకృష్ణ (4) , దీపక్ (4), మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని కింగ్ జార్జ్ ఆసుపత్రికు తరలించారు.

 

మరిన్ని వార్తలు