సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సోమవారం మరో ఇద్దరికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్రెడ్డి సోమవారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుద చేశారు. ఈ రోజు 68 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్గా తేలిందన్నారు. కరోనా పాజటివ్గా తేలినవారిలో ఒకరు ఢిల్లీ నుంచి వచ్చిన రాజమండ్రికి చెందిన 72 ఏళ్ల వృద్దుడు కాగా, ఇంకొకరిని ఢిల్లీ నుంచి సామర్లకోటకు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు.