ఏపీలో 8 లక్షలకు చేరువలో పరీక్షలు

27 Jun, 2020 03:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ పరీక్షలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగం పెంచింది. 8 లక్షల మార్కుకు చేరువలో ఉంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 22,305 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 7,91,624కు చేరింది. తాజాగా 605 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 11,489కి చేరింది. ఇందులో 1,764 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి కాగా.. 372 కేసులు ఇతర దేశాల నుంచి వచ్చిన వారివి. కొత్తగా 208 మంది డిశ్చార్జి కావడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 5,196కు చేరింది. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 10 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 146కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,145గా ఉంది. 

>
మరిన్ని వార్తలు