చిత్తూరు జిల్లాలో కరోనా తగ్గుముఖం

8 Apr, 2020 09:17 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడచిన  48 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం 17 మంది కరోనా భాదితులకు చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారు ఎవరితో కాంటాక్ట్ అయ్యారన్న దాని మీద అధికారులు ఎక్కువ దృష్టి పెట్టారు. స్విమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ 19 పరీక్షలు కొనసాగుతున్నాయి. రెడ్ జోన్ ప్రాంతాల్లో ముమ్మరంగా శానిటేషన్ పనులు జరుగుతున్నాయి. జిల్లాలో కరోనా నివారణ చర్యల మీద ఎప్పటికప్పుడు నోడల్ అధికారి సిసోడియా సమీక్షిస్తున్నారు. 

మరిన్ని వార్తలు