సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 17,695 మందికి పరీక్షలు నిర్వహించగా 130 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4659 కు చేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. ఇందులో 810 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉండగా, 131 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న 30 మందిని కొత్తగా డిశ్చార్జి చేయడంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 2353కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1290 గా ఉంది. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో మరొకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 75కు చేరింది. (చదవండి: మరింత తగ్గిన మరణాల రేటు)