సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 33,580 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 4,074 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 53,724 కు చేరింది. తాజా పరీక్షల్లో 17,385 పరీక్షలు ట్రూనాట్ పద్ధతిలో చేయగా.. 16,195 పరీక్షలు ర్యాపిట్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. రాష్ట్రంలో కొత్తగా 1335 మంది వైరస్ బాధితులు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 24,228 కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా 54 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 696 కు చేరింది. 28,800 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 13,49,112 నమూనాలను పరీక్షించారు. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
(రేపటి నుంచి తిరుపతిలో సంపూర్ణ ఆంక్షలు)