ఒకే రోజు 762 మంది డిశ్చార్జి

8 Jul, 2020 04:20 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందిన అనంతరం ఒకేరోజు పెద్ద సంఖ్యలో బాధితులు డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో 762 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 9,745 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో పేర్కొంది. సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 1,178 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,197కు చేరింది. ప్రస్తుతం 11,200 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 13 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 252కు చేరింది. మృతుల సంఖ్య 252కు చేరింది.

మొత్తం టెస్టులు 10,50,090
పాజిటివిటీ రేటు    2.02 
రికవరీ రేటు    45.97 
మృతుల శాతం    1.19  

మరిన్ని వార్తలు