ఏపీ : ఎమ్మెల్యేకు కరోనా పరీక్షలు

28 Mar, 2020 16:09 IST|Sakshi

సాక్షి, గుంటూరు : కరోనావైరస్‌ సోకిందన్న అనుమానంతో జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేను అధికారులు ఐసోలేషన్‌కి తరలించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లొచ్చిన ఎమ్మెల్యే బావమరిదికి, ఆయన భార్యకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన ఇచ్చిన విందులో పాల్గొన్నట్లు చెబుతున్న ఎమ్మెల్యేకు కూడా వైరస్‌ సోకిందేమోనన్న అనుమానంతో ఐసోలేషన్‌కి తరలించారు. గుంటూరు సమీపంలోని ఓ మెడికల్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌కు ఎమ్మెల్యేను, ఆయన కుటుంబ సభ్యులను తరలించి కరోనా పరీక్షలు నిర్వహించారు. 
(చదవండి : క్వారంటైన్‌కి సిద్దపడేవారికే అవకాశం: వైఎస్‌ జగన్‌)

మరిన్ని వార్తలు