ఏపీలో కొత్తగా 98 కరోనా కేసులు

31 May, 2020 13:33 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 98 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,042కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 9,370 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 98 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,135 మంది కరోనా నుంచి కోలుకోగా, 62 మంది మరణించారు. ప్రస్తుతం 845 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. (చదవండి : భారత్‌లో 5 వేలు దాటిన కరోనా మరణాలు..)

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,82,143కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 86,983 మంది కరోనా నుంచి కోలుకోగా.. 5,164 మంది మృతిచెందారు.

మరిన్ని వార్తలు