కరోనా నివారణ: ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం

12 Apr, 2020 12:33 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను ప​కడ్బందీగా అమలు చేస్తోంది. తాజాగా కరోనా నివారణకు కేంద్రం చేసిన మరో సూచన అమల్లోకి తీసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధించింది. ఉమ్మివేయడం, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులు నమిలి పడేయడంపై నిషేధం విధిస్తూ.. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీ చేసింది. 

సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష
తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం అధికారులతో​ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, తదితర ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు