సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 502కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి బుధవారం ఉదయం వరకు జరిగిన కరోనా నిర్దారణ పరీక్షలో పశ్చిమ గోదావరిలో 8, కర్నూలులో 6, గుంటూరులో 4, కృష్ణా జిల్లాలో ఒక్క కేసు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు కరోనా బారి నుంచి కోలుకున్న 16 మంది డిశార్జ్ కాగా, 11 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఏపీలో 475 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 118 కరోనా కేసులు నమోదుకాగా, నలుగురు మృతిచెందారు.
జిల్లాల వారిగా కరోనా పాజిటివ్ కేసులు :