-

ఏపీలో 44కు చేరిన కరోనా కేసులు

31 Mar, 2020 21:56 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత మరో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 44కు చేరింది. దీంతో  24 గంటల్లో ఏపీలో మొత్తం 21 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం రాత్రి 9 గంటల తర్వాత మొత్తం 256 శాంపిళ్లను పరీక్షించగా 21 కరోనా పాజిటివ్‌, 235 కరోనా నెగిటివ్‌గా తేలాయని వెల్లడించారు. ఇప్పటివరకు ఇద్దరు కోలుకున్నట్టు చెప్పారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు..
ప్రకాశం - 11
విశాఖపట్నం - 10
గుంటూరు -9
కృష్ణా -5
తూర్పు గోదావరి -4
అనంతపురం-2
చిత్తూరు -1
నెల్లూరు -1
కర్నూలు-1

మరిన్ని వార్తలు