కోడుమూరు ఎమ్మెల్యేకు కరోనా

26 Jun, 2020 11:17 IST|Sakshi

కోడుమూరు: కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌కు గురువారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో ఆయన హోమ్‌క్వారంటైన్‌లో ఉన్నారు. కె.నాగలాపురం దగ్గర ఉన్న విశ్వభారతి ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు ఎమ్మెల్యేను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా తెలంగాణలోనూ పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు