సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 27,643 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,062 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 22,259 కి చేరింది. తాజాగా 1,332 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంత భారీ స్థాయిలో కరోనా బాధితులు కోలుకుని ఒకేసారి డిశ్చార్జ్ కావడం ఇదే తొలిసారి. దీంతో వైరస్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 11,101 కి చేరింది. ఇక రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 12 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 264కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,894 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10,77, 773 కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఆసుపత్రుల్లో ఉన్న పేషెంట్ల కంటే రికవరీ అయిన వారి సంఖ్య అధికంగా ఉంది. (హైకోర్టులో 10 మందికి పాజిటివ్)