సాక్షి, హైదరాబాద్: గత నెల 22న ఏపీ శాసనసభ జీరో అవర్లో సభ్యులు ప్రస్తావించిన అంశాలపై విచారణ చేసి నివేదిక ఇచ్చేందుకు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ నెల 18న సమావేశం కానుంది. కమిటీ 11న సమావేశం కావాల్సి ఉండగా జన్మభూమి, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సమావేశాన్ని 18వ తేదీకి వాయిదా వేశారు. కమిటీలో గడికోట శ్రీకాంత్రెడ్డి (వైఎస్సార్సీపీ), తెనాలి శ్రావణ్కుమార్ (టీడీపీ), పి. విష్ణుకుమార్ రాజు(బీజేపీ) సభ్యులుగా ఉన్నారు.