అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

26 Jan, 2015 12:36 IST|Sakshi

అమరావతి: గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరులో అప్పుల బాధ తాళలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన  సాంబశివ రావు(49), భార్య కోటేశ్వరమ్మ  నాలుగు ఎకరాల్లో మిరప, పత్తి పంట సాగు చేశారు. ఆయన ఆశించిన స్తాయిలో  దిగుబడి రాలేదు. పంటల కోసం సాంబశివరావు రూ.4 లక్షలు పైగా అప్పు చేశారు.  తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు