కాకినాడలో దంపతుల ఆత్మహత్య

28 Jul, 2017 16:24 IST|Sakshi
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని గోదావరిగుంటలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక నివాసముంటున్న బయ్యపురెడ్డి దుర్గాప్రసాద్‌(34), మంగమ్మ(25)లు భార్యాభర్తలు. దంపతులిద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇరుగుపొరుగు వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబకలహాల నేపథ్యంలోనే దంపతులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్ధానికులు చెబుతున్నారు. వీరికి సంతానం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు