సాక్షి, అమరావతి: కోవిడ్-19 విజృంభణతో యావత్ ప్రపంచం వణికిపోతోంది. 136 దేశాలకు విస్తరించిన ఈ ప్రాణాంతక వైరస్ను అంటువ్యాధిగా పరిగణించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19ను ‘ప్రపంచ మహమ్మారి’గా ప్రకటించింది. ప్రాంతాలు దాటిన కరోనా ప్రపంచాన్ని కమ్మేసిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. నిఘా, నియంత్రణ, నివారణతో వైరస్కు అడ్డుకుట్ట వేయొచ్చని వెల్లడించింది. ఈమేరకు ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని వివరించారు.
ఇప్పటివరకు వైరస్ అనుమానితులుగా పరీక్షలు జరిగినవారు 70 మంది
కరోనా పాజిటివ్ కేసుగా తేలింది 1
నెగెటివ్గా నిర్ధారణ అయింది 57 మంది
శాంపిల్స్ ఫలితాలు రావాల్సినవి 12
ఇప్పటివరకు స్క్రీనింగ్ జరిగింది, పర్యవేక్షణలో ఉన్నవారి సంఖ్య: 777
పర్యవేక్షణలో ఉన్న బాధితుల సంఖ్య 512
28 రోజుల పర్యవేక్షణ పూర్తి చేసుకున్న బాధితులు 244
ఆస్పత్రి అబ్జర్వేషన్లో ఉన్నవారి సంఖ్య 21
విజయవాడలో నిర్ధారణ పరీక్ష..
1897 అంటువ్యాధుల చట్టం ప్రకారం కరోనా నియంత్రణకు జిల్లా కలెక్టర్లు, మెడికల్ హెల్త్ ఆఫీసర్లకు అధికారాలు ఇచ్చినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ చెప్పారు. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో కోవిడ్-19 వ్యాధి నిర్ధారణ కేంద్రం ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇక కోవిడ్-19 ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్లను జిల్లా నోడల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం ప్రకటించిందని ఆయన తెలిపారు.
సహాయ కేంద్రాలు.. జాగ్రత్తలు
బాధ్యతగా ఉండాలి..
జిల్లాలవారీగా కరోనా వివరాలు..