సీపీఐ(ఎంఎల్‌) సీనియర్‌ నాయకురాలు మృతి

24 Feb, 2020 17:26 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ సీనియర్‌ నాయకురాలు కామ్రేడ్‌ జయమ్మ సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పలాస ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. 70 ఏళ్లుగా గిరిజన సాయుధ పోరాటంలో ఆమె చురుకైన పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో 35 సంవత్సరాలు అజ్ఞాతవాసంలోనే ఉన్నారు. అనంతరం 1995లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం జనజీవనానికే మొగ్గు చూపారు.

మరిన్ని వార్తలు