సదావర్తి భూములను పరిశీలించిన నారాయణ

22 Sep, 2017 19:18 IST|Sakshi
చెన్నై: తమిళనాడులోని నావలూరు,తాళంబూరులోని సదావర్తి భూములను సీపీఐ నేత నారాయణ శుక్రవారం పరిశీలించారు. తిరుపోరూరు తహసీల్దారు వద్ద భూముల విలువను అడిగి తెలుసుకున్నారు. సదావర్తి భూములు ఎకరానికి 4 కోట్ల 67లక్షలు ధర పలుకుతాయని తహసీల్దారు ఆయనకు వివరించారు.
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తమ పార్టీకి చెందిన వారికే తక్కువ ధరకు కట్టబెట్టే ప్రయత్నం చేసిందని నారాయణ ఆరోపించారు. ప్రభుత్వమే ఆ భూములను స్వాధీనం చేసుకుని తెలుగు వారి కోసం వినియోగించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరిన్ని వార్తలు