భూసేకరణకు వ్యతిరేకంగా సీపీఐ రాస్తారోకో

20 Dec, 2015 11:54 IST|Sakshi

భూపరిరక్షణ పోరాట కమిటీ నాయకుల అరెస్ట్‌కు నిరసనగా సాలూరు పట్టణంలో ఆదివారం సీపీఐ రాస్తారోకో చేసింది. విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం భూమి సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ భూపరిరక్షణ పోరాట కమిటీ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం మందస్తుగా స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుంది. దీనికి నిరసనగా సీపీఐ నాయకుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో జాతీయరహదారిపై రాస్తారోకోకు దిగారు.


 

మరిన్ని వార్తలు