విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు నివాసాన్ని సీపీఐ కార్యకర్తులు ముట్టడించారు.శుక్రవారం విజయనగరంలోని అశోక్గజపతి రాజు నివాసం ముందు సీపీఐ కార్యకర్తలు నిరసన తెలిపారు. అందులోభాగంగా ఆయనకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు.
కేంద్రమంత్రి ఇంట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు సీపీఐ కార్యకర్తులు ప్రయత్నించారు. ఆ క్రమంలో వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దాంతో సీపీఐ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు.