'అరచేతిలో వైకుఠం చూపిన చంద్రబాబు'

7 Sep, 2014 13:22 IST|Sakshi
రామకృష్ణ

హైదరాబాద్: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.  శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలను చర్చిండంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.  రైతు రుణమాఫీ, రాజధాని సహా ఏపీలో నెలకొన్న ఆర్థిక స్థితులపై చర్చ జరగలేదన్నారు.

ఏపీ ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని శ్వేతపత్రాలు విడుదల చేసిన చంద్రబాబు ప్రజలకు మాత్రం అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. రాజధాని విషయంలో అన్యాయం జరిగితే సహించం అని రామకృష్ణ హెచ్చరించారు.
**

మరిన్ని వార్తలు