బాబుపై కేసు నమోదు చేయకుంటే ...

14 Jun, 2015 13:30 IST|Sakshi
బాబుపై కేసు నమోదు చేయకుంటే ...

విశాఖపట్నం: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే కేంద్రం, టీఆర్ఎస్ ప్రభుత్వాలు... టీడీపీతో లాలూచీ పడ్డాయని ప్రజలు భావించ వలసి ఉంటుందని ఆయన తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో మధు మాట్లాడుతూ... శ్రీకాకుళం జిల్లా పొలాకిలో పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ఒప్పంద పత్రాలు ఏకపక్షంగా జరిగాయని ఆరోపించారు.

అంతేకాకుండా పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం 1500 ఎకరాల భూమి సేకరించేందుకు ప్రయత్నాలు మొదలైనాయని ఆయన విమర్శించారు. జూన్ 23 నుంచి ప్రారంభం కానున్న లారీల సమ్మెకు సీపీఎం మద్దతు ఉంటుందని పి.మధు వెల్లడించారు.

మరిన్ని వార్తలు