పెట్టుబడులను ఆకర్షించడానికే

25 Jul, 2017 01:29 IST|Sakshi
‘రాజధాని భూములతో ముడుపుల బేరం’ వార్తకు సీఆర్‌డీఏ వివరణ
 
సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: అమరావతిలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి చౌక గా 200 ఎకరాలను కట్టబెట్టిన విషయాన్ని సీఆర్‌డీఏ అంగీకరించింది. ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకోవడానికి, పెట్టుబడులను ఆకర్షించేందుకే ఎకరా రూ.50 లక్షలకు ఇచ్చామని వివరణ ఇచ్చింది. గ్లోబల్‌ టెండర్లు లేకుండానే రాజధానిలో ఎస్‌ఆర్‌ఎం వర్సిటీకి ఎకరా కేవలం 50 లక్షల చొప్పున 200 ఎకరాలను కట్టబెట్టిన విషయంపై ‘రాజధాని భూములతో ముడుపుల బేరం’ శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 22న కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై సీఆర్‌డీఏ సోమవారం వివరణ ఇచ్చింది.
మరిన్ని వార్తలు