తూర్పుగోదావరి : ‘అన్నా! సీఎం అయిన తరువాత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించన్నా!’ అని కైకవోలుకు చెందిన కొప్పిశెట్టి లీలాకుమారి జగన్ను కోరింది. ప్రజాసంకల్పయాత్రలో ఆమె జగన్ను కలుసుకుని తలపాగా అందించింది. తాను బీకాం, బీఈడీ చదివానని, టీడీపీ అధికారంలోకి వచ్చాక కేవలం ఒక్క డీఎస్సీ నిర్వహించడంతో ఉద్యోగాలు రాక ప్రైవేటు పాఠశాలల్లో తక్కువ జీతాలకు పని చేయాల్సి వస్తోందని వాపోయింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారం సాధించాక వైఎస్ మాదిరిగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరింది.