సత్రశాలలో మొసళ్ల సంచారం

14 Aug, 2018 12:21 IST|Sakshi
రిజర్వాయర్‌లో సంచరిస్తున్న మొసలి

అమరావతి ,సత్రశాల (రెంటచింతల):  రెంటచింతల మండలం సత్రశాల సమీపంలో కృష్ణానదిపై నిర్మించిన నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌లో మొసళ్ల సంచారం పెరిగింది. జన సంచారం లేని సమయంలో మొసళ్లు ఒడ్డుకు చేరుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టు రిజర్వాయర్‌ సుమా రు 1,900 హెక్టార్లలో ఉంది. ఎగువనున్న నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నుంచి ఈ రిజర్వాయర్‌లోకి మొసళ్లు వస్తున్నాయని అధికారులు   చెబుతున్నారు.

మరిన్ని వార్తలు