లోక్‌అదాలత్‌లో బాధితుడికి రూ.కోటి నష్టపరిహారం

15 Dec, 2019 04:28 IST|Sakshi

కడప అర్బన్‌: వైఎస్సార్‌ జిల్లా కడపలోని ఎన్జీవో కాలనీకి చెందిన ఆర్‌ వీర సుదర్శన్‌రెడ్డికి శనివారం జాతీయ లోక్‌అదాలత్‌లో రూ.కోటి పరిహారం లభించింది. 2015లో ఇంపీరియల్‌ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ ఫారమ్స్‌ సంస్థతో పన్నెండు సెంట్ల స్థలం అగ్రిమెంట్‌ విషయంలో సుదర్శన్‌రెడ్డికి వివాదముంది. దీనిపై ఆయన జిల్లా కోర్టులో కేసు వేశారు. శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ సందర్భంగా జిల్లా కోర్టులోని మొదటి బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ సమక్షంలో సంస్థ ప్రతినిధులకు సుదర్శన్‌రెడ్డికి మధ్య రాజీ కుదిర్చారు. సుదర్శన్‌రెడ్డికి రూ.కోటి నష్టపరిహారాన్ని వెంటనే అందేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్‌ జిల్లా వ్యాప్తంగా లోక్‌ అదాలత్‌లో పరిష్కారమైన 1446 కేసులలో ఇంత పరిహారం వచ్చిన కేసు ఇదే కావడం విశేషం. 

మరిన్ని వార్తలు