తిరుమల: మంగళవారం 59,649 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, శ్రీవారి హుండీకి రూ. 2.14 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ సాధారణంగా ఉందని, రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు కాలినడకన వచ్చిన భక్తులకు 5 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.