పదే పదే బయట తిరిగితే వాహనం సీజ్
కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు సీఎస్, డీజీపీ దిశా నిర్దేశం
అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతి
నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు
ఇంట్లో ఐసోలేషన్లో ఉండాల్సిన వారు బయటకు వస్తే కేసులు
పదే పదే బయట తిరిగితే వాహనం సీజ్
కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు సీఎస్, డీజీపీ దిశా నిర్దేశం
అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతి
నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు
ఇంట్లో ఐసోలేషన్లో ఉండాల్సిన వారు బయటకు వస్తే కేసులు
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారిని పారద్రోలడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి వారు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చూడాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పబ్లిక్, ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదని, అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. రాత్రి 8 గంటల తర్వాత నిత్యావసర వస్తువుల విక్రయానికి సైతం అనుమతి లేదన్నారు. పార్టీలు, ఫంక్షన్లు, వివాహాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, మున్సిపాలిటి, రెవెన్యూ శాఖల సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని చెప్పారు. అత్యవసర సమయాల్లో 100, 104 విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. (పటిష్టంగా లాక్ డౌన్)
తాజాగా కీలక నిర్ణయాలు