విజయనగరం ఏజెన్సీలో కూంబింగ్

27 Aug, 2015 11:51 IST|Sakshi

విజయనగరం: మావోయిస్టుల కదలికలున్నాయనే సమాచారంతో విజయనగరం జిల్లాలో భద్రతా దళాల తనిఖీలు ముమ్మరం చేశాయి. గురువారం ఉదయం నుంచి ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ ప్రారంభించారు. అదే విధంగా మక్కువ మండలంలోని దుగ్గేరు గ్రామ వార సంతలో బీఎస్‌ఎఫ్ బలగాలు, పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ కమాండెంట్ జగన్‌మోహన్‌రావు, ఎస్సై సిరిపురపు రాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు