ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఉపాధి కూలీల ఆందోళన

9 Feb, 2015 15:34 IST|Sakshi

డీ.హీరేహాళ్(అనంతపురం): డీ.హీరేహాళ్ మండలంలోని మురిడి గ్రామంలోని ఉపాధి కూలీలు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఉపాధి హామీ కూలీలకు గత మే నెల నుంచి కూలీ డబ్బులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. డబ్బులు ఇచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని డిమాండ్ చేశారు. దీంతో స్థానిక ఏపీఓ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు